Telangana

ఒక‌రి ర‌క్త‌దానం మ‌రొక‌రికి ప్రాణ‌దానం – “సేవా పక్షం” కార్యక్రమంలో గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు:

ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని..మ‌రొక‌రికి ప్రాణ‌దానం చేసిన వార‌మ‌వుతామ‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు . ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌న్మ‌దినంను పుర‌స్క‌రించుకుని ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం ఇస్నాపూర్ చౌర‌స్తా వ‌ద్ద ఉచిత వైద్య‌, ర‌క్త‌దాన శిభిరాన్ని ఆయ‌న ప్రారంభించారు. పటాన్ చెరు ఓబిసి మోర్చా మండల కమిటీ ఆధ్వర్యంలో సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య ,రక్తదాన శిబిరం నిర్వహించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ర‌క్తదానంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు .త‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు ప్ర‌తి నెల ర‌క్తం అవ‌స‌రం ఉంటుంద‌ని…వారికి స‌రైన స‌మ‌యంలో ర‌క్తం ఎక్కించ‌క‌పోతే ప్రాణాల‌కు ప్ర‌మాదం ఉంటుంద‌న్నారు.
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌న్మ‌దినంను పుర‌స్కరించుకుని ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ట్లు గ‌డీలశ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నరేందర్ రెడ్డి లు హాజ‌ర‌య్యారు. ఓబిసి మోర్చా చేపట్టిన వైద్య శిభిరానికి, ర‌క్త‌దాన శిభిరానికి సహాకరించిన మహేశ్వర మెడికల్ కాలేజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పటాన్చెరు మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ గౌడ్, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, జనగాం జిల్లా ఇన్చార్జ్ శేఖర్, పటాన్చెరు అసెంబ్లీ కన్వీనర్ బేజుగం శ్రీనివాస్ గుప్తా, నరెందర్ గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు మధుకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు గడ్డ పుణ్యవతి, పటాన్చెరు మండల ప్రధాన కార్యదర్శి కావలి వీరేశం, మరియు యస్.ఆర్.కే యువసేన సభ్యులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago