politics

జర్నలిస్టులకు ఎమ్మెల్యే జిఎంఆర్ అపూర్వ కానుక

_80 మంది జర్నలిస్టులకు 50 లక్షల రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్

_జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం

మనవార్తలు ,పటాన్ చెరు:

పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులకు ఎమ్మెల్యే జిఎంఆర్ తన పుట్టినరోజున అపూర్వ కానుకను అందజేశారు.ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా నిలుస్తూ.. అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పేరుందిన జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం.. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందించే ప్రక్రియ ప్రారంభించారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో వివిధ పత్రికలు, చానళ్లలో విధులు నిర్వహిస్తున్న 80 మంది పాత్రికేయులకు 50 లక్షల రూపాయల వ్యయంతో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందించారు.

సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో జర్నలిస్టుల సోదరులకు వీటిని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమం కోసం మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని తెలిపారు. మూడు సంవత్సరాల పాటు సంవత్సరానికి 15 లక్షల రూపాయల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందిస్తున్నామని తెలిపారు.

పటాన్చెరు నియోజకవర్గ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర క్రియాశీలకమని అన్నారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారంలో సైతం ముందుంటున్నారని అభినందించారు.నియోజకవర్గ జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడం పట్ల జర్నలిస్టులు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా నియోజకవర్గ జర్నలిస్టులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను పూలమాలలు, శాలువలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, టిఆర్ఎస్ కార్మికు విభాగం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ చారి, వంగరి అశోక్, మెరాజ్ ఖాన్, నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు.

admin

Recent Posts

మరోసారి భక్తి భావం చాటిన ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత_ ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్ శాస్త్రోక్తంగా మొదలైన శ్రీ ఎల్లమ్మ పోచమ్మ…

1 day ago

లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్ అధినేత సాయిరాం గుప్తా ఆధ్వర్యంలో చలివేంద్రం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్ చెరు పట్టణం ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా సాయి లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్…

1 day ago

భవిష్యత్తుకు తగ్గ అధ్యాపకులను తీర్చిదిద్దుతాం

గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ మనవార్తలు ప్రతినిధి ,…

3 days ago

*రియల్ హీరో సోనుసూద్ చేతుల మీదుగా ఘనంగా అశ్య ఫుడ్స్ ప్రోడక్ట్ లాంచ్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్:  ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…

3 days ago

కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు హైకోర్టు చెక్

“కాళేశ్వరం నిజం బయటపడింది  బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…

4 days ago

మహిళల భద్రత సామాజిక బాధ్యత

పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మహిళలు భయం లేకుండా…

4 days ago