Telangana

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన : చిట్కుల్ సర్పంచ్ నీలం మదు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు:

నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి భారత రాజ్యంగ నిర్మాత పేరు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో దేశం గర్విస్తున్నది, అంతటి గొప్ప మహానుభావుడి పేరు పెట్టడంతో తెలంగాణ సచివాలయం దేశానికే ఆదర్శంగా నిలవనున్నదని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. సచివాలయానికి అబేంద్కర్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి, అలాగే సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు మధు పాలబిషేకం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఓ వైపు దళిత అభ్యన్నతికి అహర్షిషలు శ్రమిస్తూనే మరో వైపు అంబేద్కర్ ను సగర్వంగా గౌరవించుకోవడంలో సీఎం కేసీఆర్ ముందున్నారన్నారు. పార్లమెంట్ నూతన భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన విషయాన్ని మధు గుర్తు చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టడం లేదని విమర్శలు చేసిన ప్రతిపక్షాలు ఇప్పడు ఏమంటాయని ప్రశ్నించారు.

అద్భుతమైన, దేశ గర్వపడే నిర్ణయాలు తీసుకోవడంలో పథకాలు అమలు చేయడంలో కేసీఆర్ కు మరొకరు సాటిరారన్నారు. తెలంగాణ పథకాలు ఇప్పుడే దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, దళిత బంధు పథకంతో దళిత కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయని నీలం మధు ముదిరాజ్ అన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు నిర్ణయాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు మెచ్చుకుంటూ ముఖ్యమంత్రి పాలభిషేకాలు చేస్తున్నారని తెలిపారు . తెలంగాణ ప్రజల తరపున కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, కృష్ణ, వెంకటేష్, భుజంగం,మురళీ, వెంకటేశ్, రాజ్ కుమార్, ఆంజనేయులు,ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

మరోసారి భక్తి భావం చాటిన ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత_ ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్ శాస్త్రోక్తంగా మొదలైన శ్రీ ఎల్లమ్మ పోచమ్మ…

1 day ago

లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్ అధినేత సాయిరాం గుప్తా ఆధ్వర్యంలో చలివేంద్రం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్ చెరు పట్టణం ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా సాయి లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్…

1 day ago

భవిష్యత్తుకు తగ్గ అధ్యాపకులను తీర్చిదిద్దుతాం

గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ మనవార్తలు ప్రతినిధి ,…

3 days ago

*రియల్ హీరో సోనుసూద్ చేతుల మీదుగా ఘనంగా అశ్య ఫుడ్స్ ప్రోడక్ట్ లాంచ్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్:  ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…

3 days ago

కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు హైకోర్టు చెక్

“కాళేశ్వరం నిజం బయటపడింది  బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…

4 days ago

మహిళల భద్రత సామాజిక బాధ్యత

పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మహిళలు భయం లేకుండా…

4 days ago