_జై తెలంగాణ నినాదాలతో మార్మోగిన మైత్రి స్టేడియం
_ఎగిరిన జాతీయ జెండాలు.. వెళ్లి వెరిసిన సమైక్యతా స్ఫూర్తి
మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు స్థానిక పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్చెరు పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి.వేలాదిమంది విద్యార్థులు, మహిళలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు, సబ్బండ వర్గాల ప్రజలు జాతీయ జెండాలను చేత బూని సమైక్యత స్ఫూర్తిని చాటిచెప్పారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ నుండి వందల బుల్లెట్లతో,.జాతీయ జెండాలతో మైత్రి స్టేడియం వజ్రోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి విద్యార్థులు, మహిళా సంఘాలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది తో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్వయంగా జాతీయ జెండాను చేత బూని బుల్లెట్ పై తిరుగుతూ అందర్నీ ఉత్సాహపరిచారు.అనంతరం మైత్రి స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణను.. బంగారు తెలంగాణగా నిర్మించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సఫలీకృతులయ్యారని అన్నారు. అన్ని వర్గాల ఆర్థిక అభ్యున్నతి ధ్యేయంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికి దిక్సూచిగా తీర్చిదిద్దారని అన్నారు.
గంగ జమునా తేహజీబ్ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మత కల్లోలాలను రెచ్చగొడుతూ, పచ్చని తెలంగాణను విచ్చిన్నం చేసేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులని, మతతత్వ రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపికి చరమగీతం పాడుతారని అన్నారు.ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులచే నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…