_జై తెలంగాణ నినాదాలతో మార్మోగిన మైత్రి స్టేడియం
_ఎగిరిన జాతీయ జెండాలు.. వెళ్లి వెరిసిన సమైక్యతా స్ఫూర్తి
మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు స్థానిక పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్చెరు పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి.వేలాదిమంది విద్యార్థులు, మహిళలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు, సబ్బండ వర్గాల ప్రజలు జాతీయ జెండాలను చేత బూని సమైక్యత స్ఫూర్తిని చాటిచెప్పారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ నుండి వందల బుల్లెట్లతో,.జాతీయ జెండాలతో మైత్రి స్టేడియం వజ్రోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి విద్యార్థులు, మహిళా సంఘాలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది తో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్వయంగా జాతీయ జెండాను చేత బూని బుల్లెట్ పై తిరుగుతూ అందర్నీ ఉత్సాహపరిచారు.అనంతరం మైత్రి స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణను.. బంగారు తెలంగాణగా నిర్మించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సఫలీకృతులయ్యారని అన్నారు. అన్ని వర్గాల ఆర్థిక అభ్యున్నతి ధ్యేయంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికి దిక్సూచిగా తీర్చిదిద్దారని అన్నారు.
గంగ జమునా తేహజీబ్ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మత కల్లోలాలను రెచ్చగొడుతూ, పచ్చని తెలంగాణను విచ్చిన్నం చేసేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులని, మతతత్వ రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపికి చరమగీతం పాడుతారని అన్నారు.ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులచే నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత_ ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్ శాస్త్రోక్తంగా మొదలైన శ్రీ ఎల్లమ్మ పోచమ్మ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్ చెరు పట్టణం ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా సాయి లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్…
గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ మనవార్తలు ప్రతినిధి ,…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…
“కాళేశ్వరం నిజం బయటపడింది బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…
పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మహిళలు భయం లేకుండా…