మనవార్తలు ,పటాన్ చెరు:
ద్రవాల మధ్య పరమాణు పరస్పర చర్య ఆవశ్యకత’పై ( Dielectric Relaxations Spectroscopic Studies_of_Hydrogen – Bonded Liquids ) సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని భౌతిక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి వి.మంజులను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెట్స్లోని భౌతిక శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తల్లోజు విశ్వం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . జీవ – ద్రవాల మధ్య పరమాణు పరస్పర చర్యను అర్థం చేసుకోవడం , ప్రోటీన్ల ద్రావణాల వాహకత ప్రవర్తనను గుర్తించి – అర్థం చేసుకోవడం , విత్తన ఉత్పత్తులలో తేమను గుర్తించడం , శరీరంలో అభివృద్ధి చెందిన కణితులను గుర్తించడం ఈ పరిశోధన లక్ష్యంగా ఆయన వివరించారు . ఈ అధ్యయనంలో భాగంగా , ఎనిమిది అంతర్జాతీయ ప్రచురణలతో పాటు ఒక పేటెంట్ను పొందడం , పుస్తకంలోని ఒక అధ్యాయాన్ని రచించడం విశేషమన్నారు . మంజుల సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె . నగేష , భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఆర్ . బాలాజీరావు , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…