రామచంద్రపురం
తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమల కోసం అమలు చేస్తున్న పథకంలో భాగంగా గొర్రెలతో పాటు మేపేందుకు ప్రతి గ్రామంలో పది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని బిజెపి రాష్ట్ర నాయకురాలు గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణి చేపడుతున్న ప్రభుత్వం లబ్ధిదారులకు గొర్రెలతో పాటు స్థలం కేటాయిస్తే గొర్రెలను మేపేందుకు ఉపయోగపడుతుందన్నారు.
గ్రామాల్లో ఉండడానికి ఇండ్లు సరిపడక ఇబ్బందులు పడుతున్న గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను పెంపకం కష్టంగా మారిందన్నారు. స్థలం లేక మొదటి విడతలో ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలను పెంచడానికి, మేపడానికి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వం గొర్రెలతో పాటు వాటిని మేపేందుకు స్థలం కేటాయిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అదే విధంగా గతం లో ఉన్న గొర్రెలకు కూడ ఇన్సూరెన్సు వర్థింపచెయలని చుచించారు. రెండో విడత పంపిణీలో భాగంగా లబ్ధిదారులకు గొర్రెలతో పాటు ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…