పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ నరేష్ కుమార్ కటారికి ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో సభ్యత్వం లభించింది. సంస్థ అధ్యక్ష – ప్రధాన నిర్వాహకుల సంతకంతో కూడిన సభ్యత్వ పత్రం డాక్టర్ కటారికి అందినట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీవి రామారావు శుక్రవారం పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో విశ్వవ్యాప్తంగా 50 వేల మంది సభ్యులున్నారని, బ్రిటన్ కేంద్రంగా రసాయన శాస్త్రాభివృద్ధి అది తోడ్పడుతోందని ఆయన తెలిపారు.
శాస్త్రం – మానవత్వాల ప్రయోజనం కోసం దోహదపడే ఈ సంస్థ పరిశోధనలకు పెద్దపీట వేయడమే కాక, పరిశోధనా పత్రాలు ప్రచురణ, సదస్సులు, చర్చాగోషులు, కార్యశాలలను నిర్వహిస్తుంటుందన్నారు. రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ లో సభ్యత్వం పొందిన డాక్టర్ కూరిని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ రాంబాబు గుండ్ల, పలువురు అధ్యాపకులు అభినందించినట్టు పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…