Categories: politics

పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ 33 మంది లబ్ధిదారులకు 9 లక్షల 57 వేల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ

 

పటాన్చెరు

నిరు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారము ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 33 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 9 లక్షల 57 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు ఎక్కువగా నివసించే పటాన్చెరు నియోజకవర్గంలో మైన మైన వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కాబోతుందని తెలిపారు. అంతేకాకుండా ఖర్చుతో కూడుకున్న డయాగ్నొస్టిక్ సేవలు ఉచితంగా అందించేందుకు పటాన్చెరు ఏరియా ఆస్పత్రిలో డయాగ్నస్టిక్ హబ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.

 

పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, గుమ్మడిదల జడ్పిటిసి కుమార్ గౌడ్, కిష్ట రెడ్డి పేట సర్పంచ్ కృష్ణ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, చంద్రారెడ్డి, విజయకుమార్, విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు మండలం అధ్యక్షులు పాండు, చంద్రశేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు,

 

 

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago