Hyderabad

కాంగ్రెస్ పార్టీ నాయకుల పై దాడులు, అక్రమ కేసులు ఆపాలి…

కాంగ్రెస్ పార్టీ నాయకుల పై దాడులు, అక్రమ కేసులు ఆపాలి…
– ఈ నెల 7న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష

పటాన్ చెరు:

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల మీద దాడులు అక్రమ కేసులు ఆపాలని సర్పంచ్ లు. ఎంపీటీసీ లకు నిధులు కేటాయించాలని మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు.

రెండు రోజుల క్రితం జరిగిన అమీన్ పూర్ మండల సర్వసభ్య సమావేశంలో సుల్తాన్ పూర్. దాయర గ్రామాలకు నిధులు కేటాయించాలని సుల్తాన్ పూర్ ఎంపీటీసీ మధురవేణి ఎమ్మెల్యే కు వినతిపత్రం ఇవ్వగా తిరస్కరిస్తూ కిందపడేసి దురుసుగా ప్రవర్తించారని దానికి నిరసనగా శనివారం పటాన్ చెరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్. పట్టణ అధ్యక్షులు నర్సింహారెడ్డిలు మాట్లాడుతూ…. గతంలో పటాన్ చెరు,భానూర్ అలాగే అమీన్ పూర్ మండలాల్లో అనేక గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి కోర్టు చుట్టూ తింపిన ఘనత టిఆర్ఎస్ పార్టీదని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల పైన అక్రమ కేసులు. దాడులు. గ్రామ సర్పంచులకు. ఎంపిటిసిల కు నిధుల కేటాయింపుల్లో వివక్షకు నిరసనగా ఈ నెల 7న బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి. డిసిసి కార్యదర్శి సామయ్య. జెడ్పిటిసి ఇంచార్జి రాధా కృష్ణ శర్మ. పీటర్ కృష్ణ. దేవాదినం. రాజు. ప్రతాప్ కృష్ణ. శీను తదితరులు పాల్గొన్నారు.

Venu

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago