Telangana

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నీలం మధు ముదిరాజ్

-తెలంగాణ పునర్నిర్మాణంలో మీ సంకల్పం గొప్పది

-ప్రజల మద్దతుతో మూసీ పునరుజ్జీవం అవుతుంది 

-ప్రజల సంక్షేమం అభివృద్ధికి పర్యాయపదం ప్రజాపాలన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

10 ఏళ్లు అప్పటి పాలకులచే నిర్లక్ష్యం చేయబడ్డ తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం గొప్పదని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని జుబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చమిచ్చి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తూ తెలంగాణ సంక్షేమం అభివృద్ధికి పాటుపడుతున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. గత పాలకులచే నిర్లక్ష్యం చేయబడ్డ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధికి కృషి చేస్తున్నాడని కొనియాడారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాడని తెలిపారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి అభివృద్ధికి పర్యాద పదంగా పాలన కొనసాగిస్తున్న రేవంత్ సర్కారుకు ప్రజల్లో విశేషమైన ఆదరణ లభిస్తుందన్నారు. ఆ ప్రజల మద్దతుతోనే మూసి ప్రక్షాళనకు ముఖ్యమంత్రి ముందడుగు వేస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ యావత్ ప్రజానీకం ఆశీస్సులతో మూసి పునరుద్ధరణ పక్క సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని నీలం మధు వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చి తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పునరుద్గాటించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago