Telangana

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నీలం మధు ముదిరాజ్

-తెలంగాణ పునర్నిర్మాణంలో మీ సంకల్పం గొప్పది

-ప్రజల మద్దతుతో మూసీ పునరుజ్జీవం అవుతుంది 

-ప్రజల సంక్షేమం అభివృద్ధికి పర్యాయపదం ప్రజాపాలన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

10 ఏళ్లు అప్పటి పాలకులచే నిర్లక్ష్యం చేయబడ్డ తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం గొప్పదని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని జుబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చమిచ్చి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తూ తెలంగాణ సంక్షేమం అభివృద్ధికి పాటుపడుతున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. గత పాలకులచే నిర్లక్ష్యం చేయబడ్డ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధికి కృషి చేస్తున్నాడని కొనియాడారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాడని తెలిపారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి అభివృద్ధికి పర్యాద పదంగా పాలన కొనసాగిస్తున్న రేవంత్ సర్కారుకు ప్రజల్లో విశేషమైన ఆదరణ లభిస్తుందన్నారు. ఆ ప్రజల మద్దతుతోనే మూసి ప్రక్షాళనకు ముఖ్యమంత్రి ముందడుగు వేస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ యావత్ ప్రజానీకం ఆశీస్సులతో మూసి పునరుద్ధరణ పక్క సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని నీలం మధు వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చి తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పునరుద్గాటించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

5 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago