Telangana

పాఠశాల అభివృద్ధికి ప్రవాస భారతీయుల సేవలు ప్రశంసనీయం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం ప్రవాస భారతీయులు సంపూర్ణ సహకారం అందించడం ప్రశంసనీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణానికి చెందిన ప్రవాస భారతీయులు ఆనంద్ గౌడ్, వెంకటేష్ గౌడ్ అన్నదమ్ములు గత 30 సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తూ, తాము చదువుకున్న పటాన్చెరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన వ్యాసరచన ఉపన్యాస పోటీల విజేతల బహుమతుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధికి ఆనంద్ గౌడ్, వెంకటేష్ గౌడ్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. గత మూడు సంవత్సరాలుగా పాఠశాలలో వృత్తి నైపుణ్య శిక్షకురాలు, ప్రత్యేక ఉపాధ్యాయురాలు, స్కావెంజర్ల కు సంబంధించిన జీతభత్యాలు అందించడంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేందుకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులోనూ పాఠశాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్పందన, ప్రభాస్ భారతీయులు వెంకటేష్ గౌడ్, ఆనంద్ గౌడ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago