Telangana

పాఠశాల అభివృద్ధికి ప్రవాస భారతీయుల సేవలు ప్రశంసనీయం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం ప్రవాస భారతీయులు సంపూర్ణ సహకారం అందించడం ప్రశంసనీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణానికి చెందిన ప్రవాస భారతీయులు ఆనంద్ గౌడ్, వెంకటేష్ గౌడ్ అన్నదమ్ములు గత 30 సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తూ, తాము చదువుకున్న పటాన్చెరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన వ్యాసరచన ఉపన్యాస పోటీల విజేతల బహుమతుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధికి ఆనంద్ గౌడ్, వెంకటేష్ గౌడ్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. గత మూడు సంవత్సరాలుగా పాఠశాలలో వృత్తి నైపుణ్య శిక్షకురాలు, ప్రత్యేక ఉపాధ్యాయురాలు, స్కావెంజర్ల కు సంబంధించిన జీతభత్యాలు అందించడంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేందుకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులోనూ పాఠశాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్పందన, ప్రభాస్ భారతీయులు వెంకటేష్ గౌడ్, ఆనంద్ గౌడ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago