మనవార్తలు , పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ఆధ్వర్యంలో ఏప్రియల్ 4-8 తేదీలలో ‘ రేడియోకెమిస్ట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ ‘ అనే అంశంపై ఐదురోజుల జాతీయ కార్యశాలను నిర్వహించనున్నట్టు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ టి.విశ్వం , డాక్టర్ నరేష్ కుమార్ కటారీలు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . భారతీయ అణు రసాయన శాస్త్రవేత్తల సంఘం ( ఐఏఎన్సీఏఎస్ ) సహకారంతో నిర్వహిస్తున్న ఈ 102 వ వర్క్షాప్లో వివిధ విద్యా సంస్థల అధ్యాపకులు , పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలను ఒక వేదికపైకి తీసుకొచ్చి , పరస్పర సహాయ సహకారాలు అందించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు .
అణు రసాయన శాస్త్రం , అణు భౌతిక శాస్త్రం , అణు రియాక్టర్ , రేడియో ఐసోటోప్ల ఉత్పత్తి – వినియోగం , ఆరోగ్యం – భద్రత వంటి అంశాలలో ప్రముఖ శాస్త్రవేత్తలు , నిపుణులు ఈ కార్యశాలలో ప్రధాన వక్తలుగా పాల్గొంటారని వారు తెలియజేశారు . ప్రాథమిక , అణు శాస్త్రాలలో పరిశోధనా నిధుల అవకాశాలపై ప్రత్యేక చర్చాగోష్టిని కూడా నిర్వహిస్తామన్నారు . ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఇచ్చే ధ్రువీకరణలు స్వల్పకాలిక కోర్సుగా కూడా గుర్తింపు ఉంటుందని తెలిపారు .
అణు శాస్త్రం – సాంకేతికత , రసాయన , భౌతిక శాస్త్రాలతో పాటు బయోసెన్స్డ్ / బయో – టెక్నాలజీ , హెల్త్ – ఫార్మా స్యూటికల్ సెన్స్లను బోధించే అధ్యాపకులు , ఆయా రంగాలలో పరిశోధనలు నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు , పరిశోధక విద్యార్థులు ఈ కార్యశాలలో పాల్గొనడానికి అర్హులన్నారు . వారు వెయ్యి రూపాయల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని సమన్వయకర్తలు తెలియజేశారు . ప్రత్యేక రుసుము చెల్లించే వారికి తొలి ప్రాధాన్యం పద్ధతిలో వసతి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు . ఇతర వివరాల కోసం vtalloju@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని , లేదా 98480 92307 / 91777 12000 లను సంప్రదించాలని వారు సూచించారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…