Districts

కారణజన్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , పటాన్ చెరు

తెలంగాణ జాతిపిత, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పటాన్చెరు, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలతో పాటు అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీ లు, రామచంద్రపురం, భారతి నగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణను నేడు దేశానికి దిక్సూచి గా మార్చిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశవ్యాప్తంగా అందరిచేత ప్రశంసలు అందుకున్న కారణజన్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని కొనియాడారు. 8 ఏళ్ల పాలనలో అట్టడుగు వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. ఇంటి ముంగట అభివృద్ధి ఇంటిలో సంక్షేమం అన్న చందంగా కెసిఆర్ గారి పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారంతో పటాన్చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్వన్ గా నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మూడు రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

పటాన్చెరు డివిజన్ పరిధిలో..

పటాన్చెరు పట్టణంలోని పంచముఖి హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. అనంతరం హజరత్ నిజాముద్దీన్ దర్గాలో ప్రార్థనలు, చద్దర్ సమర్పించారు. ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మార్కెట్ యార్డు ఆవరణలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కేసీఆర్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో నిరు పేదలకు అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అఫ్జల్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago