Districts

కారణజన్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , పటాన్ చెరు

తెలంగాణ జాతిపిత, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పటాన్చెరు, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలతో పాటు అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీ లు, రామచంద్రపురం, భారతి నగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణను నేడు దేశానికి దిక్సూచి గా మార్చిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశవ్యాప్తంగా అందరిచేత ప్రశంసలు అందుకున్న కారణజన్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని కొనియాడారు. 8 ఏళ్ల పాలనలో అట్టడుగు వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. ఇంటి ముంగట అభివృద్ధి ఇంటిలో సంక్షేమం అన్న చందంగా కెసిఆర్ గారి పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారంతో పటాన్చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్వన్ గా నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మూడు రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

పటాన్చెరు డివిజన్ పరిధిలో..

పటాన్చెరు పట్టణంలోని పంచముఖి హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. అనంతరం హజరత్ నిజాముద్దీన్ దర్గాలో ప్రార్థనలు, చద్దర్ సమర్పించారు. ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మార్కెట్ యార్డు ఆవరణలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కేసీఆర్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో నిరు పేదలకు అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అఫ్జల్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago