Telangana

జ్యోతి విద్యాలయoలో నేషనల్ వాలి బాల్ పోటీలు ప్రారంభం

_వివిధ రాష్ట్రాల నుండి క్రీడాకారులు హాజరు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

భారత్ హెవీ ఎలక్రీకల్ లిమిటెడ్ (భెల్) స్పోర్ట్స్ డెవలప్ మెంట్ క్లబ్ అధ్యక్షుడు, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారం తో భెల్ స్పోర్ట్స్ డెవలప్ మెంట్ క్లబ్ మరియు జ్యోతి విద్యార్థులయ హై స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నేషనల్ ఇంటర్ స్కూల్, ఇంటర్ కాలేజ్ అండ్ క్లబ్ వాలీబాల్ పోటీలు బుధవారం రోజు ప్రారంభమయ్యాయి. భెల్ జి.ఎం బి.శ్రీనివాస్, డి.జి.ఎం. ప్రసాద్, వాలీబాల్ డెవలప్ మెంట్ అసోసియేషన్ ట్రెజరర్ కృష్ణ ప్రసాద్ లు ముఖ్యఅతిదులుగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుండి మొత్తం 80 టీములు ఇందులో పాల్గొన్నాయి. ఇంటర్ స్కూల్ బాయస్ అండ్ గల్స్, ఇంటర్ కాలేజ్ అండ్ క్లబ్ ( ఉమెన్) విభాగాల్లో పోటీలు నాలుగు రోజుల పాటు జరుగనున్నాయి.

ఇందుకు గాను భెల్ ఎంప్లాయిస్, వాలీబాల్ అసోసియేషన్, జ్యోతి విద్యార్థులయ పూర్వ విద్యార్థులు, సీనియర్ వాలీబాల్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పూర్తి సహాయసాకారాలు అందజేస్తున్నారు. వాలీబాల్ డెవలప్ మెంట్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ వెంకట్రామిరెడ్డి స్మారక టోర్నమెంట్ ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారని, ఈ సారి భెల్ జ్యోతి విద్యాలయ హై స్కూల్ లో నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నట్లు స్కూల్ పిన్సిపాల్ ఉమామహేశ్వరి తెలిపారు. ఇందుకు సహాయసాకారాలు అందించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, పూర్వ విద్యార్థులకు, స్పాన్సర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆమే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరవ రామకృష్ణ, కిషోర్ గంజి,మంజీత్ రెడ్డి, రామకృష్ణo రాజు, స్కూల్ పి ఈ టి లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago