Telangana

వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ఫ్రీడమ్ పార్కులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మహనీయుల త్యాగాలను నేటి తరాలకు తెలియజేయాలన్న సమున్నత లక్ష్యంతో నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ప‌టాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా చేపడుతున్న ద్విసప్తహ కార్యక్రమాల్లో భాగంగా మూడవ రోజు బుధవారం ప‌టాన్ చెరు డివిజన్ కృషి డిఫెన్స్ కాలనీలోనీ ఫ్రీడం పార్కులో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ లతో కలిసి 75 మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవ భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఫ్రీడం పార్కులో 75 మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణీ చేయడంతో పాటు, మహనీయుల త్యాగాలనుస్మరిస్తూ కరపత్రాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

_తిరంగా ర్యాలీలను జయప్రదం చేయండి

స్వతంత్ర భారత వజ్రోత్సవ భాగంగా ఈనెల 11, 13 తేదీలలో నిర్వహించనున్న ఫ్రీడం రన్, తిరంగా ర్యాలీలను జయప్రదం చేయాలని జిఎంఆర్ కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అందరూ భాగస్వాములు అయ్యేలా కృషి చేయాలని కోరారు. బుధవారం ఎంపీడీవో సమావేశ మందిరంలో నియోజకవర్గస్థాయి విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారత వత్రోత్సవాల సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలతోపాటు ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.

విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధుల చరిత్రను తెలియజేసేలా కార్యక్రమాలు రూపొందించాలని కోరారు. ఈనెల 11, 13 తేదీలలో నిర్వహించనున్న ర్యాలీలలో టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలను త్రివన్న రంగుల దీపాలతో అలంకరించాలని కోరారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రసాద్, మండల విద్యాధికారి రాథోడ్, ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రాఘవేందర్ రెడ్డి,ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్లు పాల్గొన్నారు

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago