మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం :
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి స్వగ్రామంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ దంపతులు చిన్నారులు, మున్సిపాలిటీ కార్మికులతో కలిసి హోలీ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. చిన్నారులు రంగులను చల్లుకుంటూ హోలీ వేడుకలను హోరెత్తించారు. వారి ఇంటి వెళ్లి చిన్నారులు రంగులు పోస్తూ హోలీ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకొని ఆనందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూచెడు పై సాధించిన విజయంకు ప్రతీక గా చిన్న, పెద్ద అని తేడా లేకుండా హోలీ వేడుకలను జరుపుకుంటారని తెలిపారు. ఈ రంగుల పండుగ హోలీ అందరికి సరికొత్త ఆనందాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. రంగులు చల్లుకునేటప్పుడు ఇతరులకు ఇబ్బందిగా మారకుండా చూసుకోవలన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ పండుగను హుందాగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…