ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే…
– ప్రారంభమైన కోవిడ్ వైద్యసేవలు
– అందుబాటులోకి ఆక్సిజన్ పడకలు
– ఆక్సిజన్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
పటాన్ చెరు:
పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు ప్రారంభమైనట్లు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా 70 ఆక్సిజన్ సదుపాయం గల పడకలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
సోమవారం ఉదయం వైద్యులు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని కోవిడ్ వార్డు ని పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తున్న తరుణంలో నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కోవిడ్ రోగుల చికిత్స కోసం ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయడంతోపాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. రోగులకు నాణ్యమైన వైద్యంతో పాటు ఉచిత భోజన వసతి, సహాయకులకు వసతి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు రెఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతనంగా కోవిడ్ వార్డు ఏర్పాటు చేస్తున్నందున ప్రజలు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సైతం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వసుంధర, వైద్యులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…