politics

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పై ఎమ్మెల్యే బహిరంగ చర్చకు సిద్ధమా…

మనవార్తలు ,రామచంద్రపురం

టీఆర్ఎస్ ఏడేళ్ళ పాల‌న‌లో ఒక్క‌రికి డ‌బుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చిన పాపాన పోలేద‌ని బీజేపీ రాష్ట్ర మ‌హిళా మాజీప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గోదావ‌రి అంజిరెడ్డి అన్నారు. ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుమారు 38 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు గొప్పగా ప్రకటించార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత‌మందికి ఇచ్చారో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. దీంతో పాటు జిహెచ్ఎంసి పరిధిలో మరో 40 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పార‌ని తెలిపారు .వీటిలో స్థానికులకి 10 శాతం క‌నీసం 4 వేల ఇళ్లు కూడా పంపిణీ చేయ‌లేద‌న్నారు .ప‌టాన్ చెరు నియోజకవర్గానికి 2014 నుంచి ఇప్పటివరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేశారో శ్వేత ప‌త్రం విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు .

నియోజ‌క‌వ‌ర్గంలో ,మండలంలో, జిహెచ్ఎంసి పరిధిలో ఎన్ని డ‌బుల్ బెడ్ రూం ఇళ్ళు ఏ ఏ గ్రామంలో నిర్మించాలో చెప్పాల‌న్నారు .డ‌బుల్ బెడ్ రూం ఇళ్ళ‌కు ఎన్ని నిధులు ఇచ్చారో వెల్లడించాలని రాష్ట్ర మహిళా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి ప్రశ్నించారు.ఏడేళ్ల పాలనలో నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా ఇచ్చారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు .

ఎమ్మెల్యే చెబుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లెక్కలు పూర్తిగా ఆ వాస్తవమని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2022 దాకా జిహెచ్ఎంసి పరిధి కాకుండా కేవలం 400 డబుల్ బెడ్రూం ఇళ్లు మాత్రమే మంజూరు అయ్యాయి అందులో ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. 400 ఇళ్లలో చిట్కుల్ లో 150, ముత్తంగి లో 100 , కొడకంచిలో 50 , జిన్నారంలో 60, కొత్తపల్లి లో 40 డబుల్ బెడ్రూం లు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కూడా 2015- 16 లో మంజూరు చేశారు నాటి నుంచి మళ్ళీ ఒక్కటైనా మంజూరు చేసిన పాపాన పోలేదు. ఇవన్నీ మేం సొంతంగా తయారు చేసి చెబుతున్న సంబంధిత ప్రభుత్వ శాఖలు ఇచ్చిన వివరాలు జిహెచ్ఎంసి పరిధిలో 40 వేల ఇళ్లు అని చెప్పారు .ఇది కూడా పూర్తి అసత్యం అని కొల్లూరు లో 15 వేల ఇల్లులు ఉంటె అందులో 10 శాతం వాటా అంటే 1500 ఇళ్లు స్థానికులకు వస్తాయి.

మరి 38 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే ఏ విధంగా చెప్పారని ప్ర‌శ్నించారు.38 వేల ఇళ్లు ఎక్కడ కట్టారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు .లేకపోతే ప్రజలను మభ్య పెట్టేందుకు ఎమ్మెల్యే అబద్దాలు చెబుతున్నారని నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పై ఎమ్మెల్యే బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. 38 వేల ఇళ్లను ఎమ్మెల్యే చూపించలేకపోతే అవాస్తవాలు చెప్పినందుకు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని బిజెపి రాష్ట్ర మహిళా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమలో మల్లేష్, రవీండెర్ గౌడ్, అమృత, అజాజ్, శాస్త్రీ, శివ, శిల్ప, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago