మనవార్తలు ,పటాన్ చెరు:
ఇప్పటికే 13 గిన్నిస్ , 15 అసిస్ట్ , నాలుగు యూనిక్ వరల్డ్ రికార్డులు సాధించి , అదే ఓ రికార్డుగా వినుతికెక్కిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ తాజాగా మరో ఆరు యూనిక్ వరల్డ్ రికార్డులను సాధించింది . ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవ , అనిల్ శ్రీవాస్తవలతో కలిసి హ్యాండ్మేడ్ పేపర్తో రూపొందించిన 2,111 క్విల్లింగ్ డాల్స్ , 1,111 ఆభరణాలతో పాటు ఆరెగామీ పేపర్తో రూపొందించిన 9,200 చేపలు , 1,145 మేష్లీ ఆకులు , 2,300 నిమ్మతొనలు , 3,501 వేల్స్ లు ఒకచోట ఉంచగా , దానిని ప్రపంచంలోనే అతి పెద్ద ప్రదర్శనగా గుర్తించి , యూనిక్ వరల్డ్ రికార్స్ వారు ఆమేరకు ధ్రువీకరణ పత్రాలను పంపారు . తాజాగా ఆరు యూనిక్ వరల్డ్ రికార్డులను సాధించిన శివాలీ , ఆమె తల్లిదండ్రులను గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు అభినందించారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…