మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న గ్రామ దేవత, బొడ్రాయి, ఊరడమ్మ, భూ లక్ష్మమ్మ, సంత నాగుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలోని గ్రామ ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, పార్టీ మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఎంపీటీసీ లు రాజు, హరిప్రసాద్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…
శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…