అమీన్పూర్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
మనవార్తలు , అమీన్పూర్:
నియోజకవర్గ పరిధిలోని మూడు మున్సిపాలిటీలలో ప్రజల సౌకర్యార్థం సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శంకర్ హోమ్స్ సమీపంలో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మూడు ఎకరాల 15 గంటల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న మాంసాహారం, కూరగాయలు, పండ్లు, పూల మార్కెట్ సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్ నిర్మాణం పూర్తయితే ఒకే ప్రాంగణంలో ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లభించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే బొల్లారం మున్సిపల్ పరిధిలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని తెల్లాపూర్ మున్సిపాలిటీ లో త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రైతులు తీసుకుని వచ్చే కూరగాయలు, మాంసాహారం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…