మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ , హెదరాబాద్ ఆధ్వర్యంలో ‘ కేస్ డిస్కషన్ మెథడాలజీ ‘ అనే అంశంపై ఐదురోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని ఈనెల 20-24 తేదీలలో నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . కేస్ డిస్కషన్ మెథడాలజీ అనేది సమస్య పరిష్కారంలో శిక్షణ కోసం అవసరమైన అనుభవపూర్వక అభ్యాస పద్ధతని , సమర్థమైన నిర్వహణకు , సందర్భోచిత విశ్లేషణ , అంతర్దృష్టుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు . విద్యార్థుల మేథస్సును ఉత్తేజపరిచేందుకు , మేథో సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేస్ మెథడ్ లెర్నింగ్ను ఉపయోగించడం ఆచరణాత్మమైనదన్నారు . కేస్ డిస్కషన్లు ఉపన్యాసాలు , సెమినార్లు , గేమ్లు , రోల్ ప్లేలు , ఇండస్ట్రియల్ సందర్శనలు , సమూహ వ్యాయామాలతో సమస్య – పరిష్కారం , నిర్ణయం తీసుకోవడం , అనులు చేసే నెపుణ్యాలను అభివృద్ధి చేయగలవని డెరైక్టర్ వివరించారు .
క్లాస్టూమ్ సెట్టింగ్ కేస్ డిస్కషన్లను హ్యాండిల్ చేయడంపై సదస్యులకు స్వీయ అనుభవాన్ని అందించడం , విభిన్న రంగాలకు చెందిన అధ్యాపకులు వారి రంగంలోని నైపుణ్యం ఉన్న ప్రాంతంలో కేసులను హ్యాండిల్ చేసేలా తర్ఫీదు ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా ప్రొఫెసర్ కరుణాకరన్ అభివర్ణించారు . బోధనలో అనుభవపూర్వక అభ్యాస పద్ధతులను అభినందించడం , కేస్ డిస్కషన్ మెథడాలజీ ప్రక్రియతో అధ్యాపకులకు పరిచయం చేయడం , తరగతి గదిలో కేసులను నిర్వహించడంలో ప్రయోగాత్మక అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఈ అధ్యాపక వికాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు .
దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలలోని అధ్యాపకుల కోసం ఈ ఎఫీడీపీని ఉద్దేశించామని , ఆసక్తి ఉన్నవారు ఇతరత్రా వివరాల కోసం కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ దివ్య కీర్తి గుప్తా dgupta@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని ఆయన సూచించారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…