అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :
రైతు కుటుంబ పోషణలో అండగా నిలిచే గోసంపదను రైతులకు అందించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట, సుల్తాన్పూర్ గ్రామాలతో పాటు గుమ్మడిదల మండల పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన రైతులకు బీరంగూడ గోశాల నుండి గోశాల నిర్వాహకులతో చేర్చించి 40 ఆవులను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో గుమ్మడిదల మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించిన బర్రెలు ఆవులు వివిధ కారణాలతో మృతి చెందాయని తెలిపారు. దీని మూలంగా రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వారిని ఆదుకోవాలన్న మానవతా దృక్పథంతో గోవులను పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు 40 గోవులను అందించామని, త్వరలోనే మరిన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం గోశాల నిర్వాహకులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కృష్ణారెడ్డిపేట సర్పంచ్ కృష్ణ, తాసిల్దార్ దశరథ్, ఎంఈఓ రాథోడ్, సీనియర్ నాయకులు రాజు, గోశాల నిర్వాహకులు దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…