పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు పట్టణం శాంతినగర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ దీపా దేవానంద్ గౌడ్ బోనాల పండుగను నిర్వహించారు. బోనాల పండుగలో భాగంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బోనాల పండుగలో ఆనందంగా పాల్గొన్నారు. మేళ తాళాలతో, డప్పు చప్పులతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లి బోనం కుండను నైవేద్యముగా పోచమ్మ తల్లికి సమర్పించారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో విద్యాసంస్థ, విద్యార్థిని విద్యార్థులు అత్యంత ఉన్నత స్థితికి ఎదగాలని ప్రిన్సిపల్ దీపా దేవానంద్ గౌడ్ కోరుకున్నారు. అదేవిధంగా బాలికలు పట్టు బట్టలతో, బాలురు పట్టు పంచెలతో, కొంతమంది విద్యార్థులు పోతురాజు వేషధారణతో ఎంతో అందంగా కనిపించారు. ఆలయ ప్రాంగణంలో విద్యార్థిని విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అలరించారు. బోనాల ఉత్సవాలలో పాల్గొన్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ప్రిన్సిపల్ దీపా దేవానంద్ గౌడ్ కోరుకుంటూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…