Telangana

వ్యవస్థాపకులుగా ఎదగండి…

విద్యార్థులకు ఎన్ఐఆర్ఎం డెరైక్టర్ డాక్టర్ వెంకటేష్ సూచన

– విజయవంతంగా ముగిసిన కార్యశాల

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

మనదేశంలో అంచనా, విశ్లేషణ సాధనాలు చాలా పరిమితంగా ఉన్నాయని, భవిష్యత్తు కోసం డేటాను విశ్లేషించే నెఫుణ్యం సాధిస్తే వ్యవస్థాపకులుగా ఎదిగి, సొంత కాళ్లపై నిలబడొచ్చని బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎం) డెరైక్టర్ డాక్టర్ హెచ్.ఎస్.వెంకటేష్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘జాతి నిర్మాణంలో రాక్ ఇంజనీరింగ్’ పాత్ర అనే అంశంపై మంగళవారం నిర్వహించిన ఒక రోజు కార్యశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్ ‘ లో భాగంగా, కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్ఐఆర్ఎం. సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేశారు.స్టార్టప్ ఇండియా ఉద్యమం 2004లో ప్రారంభం కాగా, 2015 వరకు కేవలం వంద స్టార్టప్లు మాత్రమే ఉన్నాయని, ఆ సంఖ్య నేటి లక్షకు చేరినట్టు సభికుల హర్షధ్వానాల మధ్య డాక్టర్ వెంకటేష్ ప్రకటించారు. అయితే అందులో కేవలం 82 మాత్రమే గనుల రంగానికి చెందినవని, ఆ రంగంలోని సమాచారాన్ని విశ్లేషించే సామర్థ్యాన్ని సాధిస్తే డేటా సెట్టింగ్గా ఎదగొచ్చన్నారు. ‘రాక్ బ్లాస్టింగ్ ఎ టూల్ ఫర్ డెవలప్మెంట్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.

సభాధ్యక్షత వహించిన గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హెదరాబాద్ డెరైక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి మాట్లాడుతూ, గనుల, శక్తి, ఓడరేవులు, క్రూడాయిల్ వ్యూహాత్మక నిల్వ, భౌగోళిక అనుసంధాన (రహదారుల) రంగాలలో అనేక ప్రాజెక్టులు మనదేశంలో అమలు చేస్తున్నారని, మౌలిక సదుపాయాల రంగం భారత్ దూసుకుపోతోందన్నారు. జోజిలా వంటి సొరంగాల తవ్వకంలో ఇంజనీర్ల కొరతను ఎదుర్కొంటోందని, కోర్ ఇంజనీరింగ్కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. ‘రాక్ ఇంజనీరింగ్: మనదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై ఉపన్యసించారు.గౌరవ అతిథిగా హాజరైన వెన్సార్ కన్స్ట్రక్షన్స్ సలహాదారు డాక్టర్ ఎం.ఎస్.వెంకటరామయ్య మాట్లాడుతూ, వర్ధమాన ఇంజనీర్లుగా ఎదుగుతున్న విద్యార్థులు సవాళ్లను స్వీకరించి, మెరుగెన పరిష్కార మార్గాలను కనుగొనాలని సూచించారు. ప్రమాదాలకు భయపడి గత 30 ఏళ్లగా మూతపడ్డ ఎన్నో బొగ్గు గనులను తాము ఉత్పాదకతలోకి తీసుకొచ్చినట్టు చెప్పారు.

తొలుత, కార్యశాల నిర్వాహకురాలు ప్రొఫెసర్ టి. మాధవి దాని లక్ష్యాలతో పాటు గీతమ్ గురించి వివరించగా, సమన్వయకర్త డాక్టర్ సీహెచ్. అఖిలేష్ వందన సమర్పణ చేశారు.ఎస్ఐఆర్ఎం శాస్త్రవేత్తలు డాక్టర్ పీసీ ఝా, డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ బీఎన్పీ శివప్రసాద్ తదితరులు నిజ-సమయ సవాళ్ల గురించి అవగాహన కల్పించడానికి రాక్ ఇంజనీరింగ్పై పరిశోధనల సైద్ధాంతిక, ఆచరణాత్మక అంశాలను వివరించారు. హెబ్రీడ్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మనదేశంలోని ఇరవై విద్యా సంస్థలకు చెందిన దాదాపు 1,150 మంది విద్యార్థులు, అధ్యాపకులు ఈ ఒకరోజు కార్యశాలలో పాల్గొని విజయవంతం చేశారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

8 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago