Telangana

జాతి నిర్మాణంలో రాక్ ఇంజనీరింగ్ పాత్ర గీతన్తో చర్చాగోష్టి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

‘జాతి నిర్మాణంలో రాక్ ఇంజనీరింగ్ పాత్ర’ అనే అంశంపై ఈనెల 18న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్లో చర్చాగోష్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మనిర్బర్ భారత్ అభియాన్లో భాగంగా, భారత గనుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎఎం) సౌజన్యంతో దీనిని నిర్వహిస్తున్నట్టు ప్రొఫెసర్ టి.మాధవి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.హెబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మనదేశంలోని ఇరవెకి పైగా సంస్థల నుంచి విద్యార్థులు,అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆమె తెలిపారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హెదరాబాద్ డెరైక్టర్:ప్రొఫెసర్ ఏ.ఆర్.శాస్త్రితో పాటు ఎన్ఎస్ఐఆర్ఎఎం డెరెక్టర్ డాక్టర్ హెచ్.ఎస్.వెంకటేష్, పలువురు శాస్త్రవేత్తలు ప్రధానవక్తలుగా పాల్గొంటారన్నారు. వృత్తిజీవితంలో ఎదురయ్యే సవాళ్ళను గురించి అవగాహన కల్పించడంతో పాటు రాక్ ఇంజనీరింగ్కు సంబంధించిన పరిశోధనలు సిద్ధాంతిక ఆవరణాత్మక అంశాలపై నిపుణులు ఉపన్యసిస్తారన్నారు.?

సారంగాలు, భూగర్భ గుహలు, తవ్వకాల ప్రాజెక్టులు, అణు విద్యుత్ ప్రాజెక్టులు, జల విద్యుత్ ప్రాజెక్టులు మొదలైన వాటిలో అవలంబిస్తున్న కొత్త సాంకేతికతలకు సంబంధించిన కేస్ స్టడీలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించనున్నట్టు డాక్టర్ మాధవి తెలిపారు. పెద్ద తవ్వకాల అనంతర ప్రభావాలను పర్యవేక్షించడంలో ఆధునిక పరికరాల పాత్రను కూడా వివరిస్తారన్నారు.సివిల్, మెనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, అనుబంధ ఇంజనీరింగ్ విభాగాల విద్యార్థులకు ఈ చర్చాగోష్టి,ఉపకరిస్తుందని ఆమె తెలిపారు.ఇతర వివరాల కోసం డాక్టర్ అరిజిత్ సాహా (7005640 623)ని సంప్రదించాలని లేదా asaha@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని డాక్టర్ మాధని సూచించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago