PATANCHERU
పట్టణ ప్రగతిని ప్రారంభించిన ఎమ్మెల్యే…
హైదరాబాద్:
పట్టణ ప్రాంతాల సమగ్ర వికాసమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టణ ప్రగతి, హరిత హరం, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
పది రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఈ సంవత్సరం దళితుల సాధికారికత కోసం రెండు రోజులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, ప్రమోద్ గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…