పటాన్ చెరు:
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది . నేటి నుంచి పది రోజుల పాటు పల్లె పట్టన ప్రగతి కార్యక్రమం కొనసాగుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని భారతీనగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ప్రారంభించారు . పటాన్ చెరు ,ఎల్.ఐ. జి బస్టాప్ ప్రాంగణంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనుల కోసం ఏర్పాటుచేసిన వాహనాలను జెండా ఊపి ఆమె ప్రారంభించారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిలు అభివృద్ధిలో ఒక భాగమని తెలిపారు.
.తెలంగాణకు హరిత హారం నిర్మించే క్రమంలో ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలని భారతినగర్ కార్పోరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పిలుపునిచ్చారు. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని ఆమె కోరారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలనీలలో పేరుకుపోయిన చెత్త ను తొలగించడం, మురికి కాలువలు శుభ్రం చేయడం, తుప్పు పట్టిన ఎలక్ట్రికల్ పోల్స్ ని తొలగించడం, గుంతలు ఉంటే వాటిని మూసివేసి నీరు నిలువ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పది రోజులపాటు నిర్వహించే ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపుచ్చారు.
ఈ కార్యక్రమానికి కమిషనర్ బాలయ్య, జి హెచ్ ఎం సి ఎలక్ట్రికల్ డిఈ నాగమణి ,టీఎస్ఎస్పి డిసిఎల్ ఏఈ దీప్తి , ఎంటమాలజీ ఏఈ శంకర్ ,జీహెచ్ఎంసీ రంజిత్ , డివిజన్ ప్రెసిడెంట్ దేవేందర్ చారి , వార్డ్ మెంబర్ నరసింహ , యాదగిరి రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , యది రెడ్డి,దేవేందర్ రెడ్డి, కృష్ణ గౌడ్, కుతుబద్దీన్, జావిద్,సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్,జీలని తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…