politics

ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలని…కార్పోరేటర్ సింధు పిలుపు

ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలని….

– కార్పోరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పిలుపు

పటాన్ చెరు:

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది . నేటి నుంచి పది రోజుల పాటు పల్లె పట్టన ప్రగతి కార్యక్రమం కొనసాగుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని భారతీనగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ప్రారంభించారు . పటాన్ చెరు ,ఎల్.ఐ. జి బస్టాప్ ప్రాంగణంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనుల కోసం ఏర్పాటుచేసిన వాహనాలను జెండా ఊపి ఆమె ప్రారంభించారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిలు అభివృద్ధిలో ఒక భాగమని తెలిపారు.
.తెలంగాణకు హరిత హారం నిర్మించే క్రమంలో ప్రతి ఒక్కరూ ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలని భారతినగర్ కార్పోరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పిలుపునిచ్చారు. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని ఆమె కోరారు.

 

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలనీలలో పేరుకుపోయిన చెత్త ను తొలగించడం, మురికి కాలువలు శుభ్రం చేయడం, తుప్పు పట్టిన ఎలక్ట్రికల్ పోల్స్ ని తొలగించడం, గుంతలు ఉంటే వాటిని మూసివేసి నీరు నిలువ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పది రోజులపాటు నిర్వహించే ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపుచ్చారు.

ఈ కార్యక్రమానికి కమిషనర్ బాలయ్య, జి హెచ్ ఎం సి ఎలక్ట్రికల్ డిఈ నాగమణి ,టీఎస్ఎస్పి డిసిఎల్ ఏఈ దీప్తి , ఎంటమాలజీ ఏఈ శంకర్ ,జీహెచ్‌ఎంసీ రంజిత్ , డివిజన్ ప్రెసిడెంట్ దేవేందర్ చారి , వార్డ్ మెంబర్ నరసింహ , యాదగిరి రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , యది రెడ్డి,దేవేందర్ రెడ్డి, కృష్ణ గౌడ్, కుతుబద్దీన్, జావిద్,సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్,జీలని తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

2 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

2 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago