Hyderabad

ప్రతి ఇంటా పచ్చదనం వెల్లివిరియాలి…ఎమ్మెల్యే

హరిత హారం ప్రారంబించిన ఎమ్మెల్యే…

పటాన్ చెరు:

భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలన్న సమున్నత లక్ష్యం తో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.ఏడో విడత హరితహారం, నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా మొదటి రోజైన గురువారం బానూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మొక్కలు నాటారు.అనంతరం గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు.

MAHIPAL REDDY

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర భూభాగంలో 24 శాతంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంపొందించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.ఇందుకు అనుగుణంగా ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.వాతావరణంలో ప్రాణవాయువును పెంచడంతోపాటు, పర్యావరణ సమతుల్యం లక్ష్యంగా హరితహారం ముందుకు సాగుతోందని తెలిపారు. నాటిన చెట్లను సంరక్షించేందుకు సైతం ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని తెలిపారు. పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ప్రతి ఒక్కరిని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, దశరథ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago