చైర్మన్ పాండురంగారెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం…
అమీన్ పూర్:
ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలకు అనుగుణంగా అమీన్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు.
బుధవారం చైర్మన్ పాండురంగారెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా 17 కోట్ల రూపాయలతో నిర్వహించతలపెట్టిన అభివద్ధి కార్యక్రమాలకు సమావేశంలో సభ్యులు ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… రాజకీయాలకు అతీతంగా అభివద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. హరితహారం పట్టణ ప్రగతి లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.వార్డు కమిటీ సమావేశాల్లో ప్రజల సూచించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు నిర్ణయించామన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా అభివద్ధి పనులు చేపడుతున్నామని గుర్తు చేశారు.అన్ని వార్డులకు సమప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అన్ని పార్టీలకు చెందిన వార్డు సభ్యులు కోరినట్లుగా నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
గురువారం నుంచి నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…