ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేత
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఫార్మా పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ఎమ్మెల్యే జిఎంఆర్ అండగా నిలిచారు. యాజమాన్యంతో చర్చించి కార్మికుడు కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించారు. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా మగ్దంపూర్ గ్రామానికి చెందిన సుంకరి యాదగిరి గత కొద్ది రోజుల క్రితం జిన్నారం మండలం కాజిపల్లి గ్రామ పరిధిలోని ఆరోరా లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధుల్లో చేరాడు. ఇటీవల పరిశ్రమలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కార్మికుడికి న్యాయం చేయాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. యాజమాన్యంతో చర్చించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కార్మికుడి కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించారు. కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…