Telangana

సృజాత్మక యోచనే విజయానికి సోపానం

_గీతం ‘రోబోటిక్స్’ కార్యశాలలో కిరణ్ మ్యాట్రిక్స్ ఎండీ ఉద్బోధ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సృజనాత్మకంగా ఆలోచించడం, విమర్శనాత్మక ఆలోచనలను అమలు చేయడం, వాస్తవ-ప్రపంచ సవాళ్ల ద్వారా సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవడం వంటివి రోబోటిక్స్ రంగంలో రాణించడానికి తోడ్పడతాయని కిరణ్ మ్యాట్రిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగానికి చెందిన ‘జీ-ఎలక్ట్రా’ క్లబ్ బుధవారం ‘రోబోటిక్స్ 1.0’ పేరిట ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.మనదేశంలోని ఐఐటీలు, ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు జాతీయ స్థాయిలో నిర్వహించే సాంకేతిక పోటీలలో పోటీపడేందుకు అవసరమైన జ్జానం, నైపుణ్యాలను గీతం ఇంజనీరింగ్ విద్యార్థులలో పెంపొందించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. కిరణ్ తో పాటు ఎంబెడెడ్ డెవలపర్లు రజనీకాంత్ సేన్, హేమలు ఈ కార్యశాలలో ముఖ్య శిక్షకులుగా వ్యవహరించారు.
ఏదైనా రోబోటిక్స్ ప్రాజెక్టుకి జట్టు సమష్ఠి క`షి, సహకారం చాలా కీలకమని, ఇందులో ఎదురయ్యే అపజయాలను విజయాలకు సోపానాలను మలచుకోవాలని వారు నొక్కి చెప్పారు.హ్యాకథాన్, రోబోటిక్స్, ఒలింపియాడ్ పేరిట ప్రతియేటా దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి సాంకేతిక పోటీలు నిర్వహిస్తుంటారని, వాటిలో పోటీ పడడానికి పేర్లు ఎలా నమోదు చేసుకోవాలో కిరణ్ మాటిక్స్ సభ్యులు వివరించారు.

కృత్రిమ మేథతో స్వతంత్రంగా వ్యవహరించే రోబోట్ లు, మనుషుల ప్రమేయంతో నడిచే రోబోట్ లు, వాటిని నిర్మించడానికి అవసరమైన ఛాసిస్, మోటార్ లు, వివిధ రకాల చక్రాలు, బ్యాటరీలు, స్విచ్ లు, ఆర్డినో యునొ, జాయ్ స్టిక్స్, ఇన్-ఫ్రారెడ్ (ఐఆర్) సెన్సార్లు, ఎల్ఎస్ఆర్బీ అల్గోరిథం వంటి పరికరాలు, అవి పనిచేసే విధానాలు వారు విశదీకరించారు.ప్రాథమిక రోబోటిక్ సిస్టమ్ లను నిర్మించడం, నిర్వహించడం వంటి వాటిపై విద్యార్థులకు కిరణ్ మ్యాట్రిక్స్ సభ్యులు మార్గనిర్దేశం చేస్తూ, వారికి ప్రయోగాత్మక అనుభవాన్ని అందించారు. అందులో చురుకుగా పాల్గొని స్వీయ అనుభవం గడించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.తొలుత, జీ-ఎలక్ట్రా అధ్యక్షుడు ఎం.సాయిక`ష్ణ స్వాగత వచనాలతో కార్యశాల ప్రారంభం కాగా, విద్యార్థి సమన్వయకర్త జేమ్స్ వందన సమర్పణతో ముగిసింది. అధ్యాపక సమన్వయకర్త ఎం.నరేష్ కుమార్ దీనిని పర్యవేక్షించారు. గీతం విద్యార్థులకు రోబో ట్రిక్స్ పై అవగాహన కల్పించి, వారిని జాతీయ సాంకేతిక పోటీలలో పాల్గొని, రాణించేలా ఈ కార్యశాల ప్రేరేపించింది అనడంలో అతిశయోక్తి లేదు.

admin

Recent Posts

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…

9 hours ago

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

21 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

21 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

21 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

21 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

2 days ago