ప్రగతి భవన్ లో సర్వే ఏజెన్సీలతో సమావేశం…
తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ డిజిటల్ సర్వేలో భాగంగా తొలుత జూన్ 11 నుంచి పైలట్ సర్వే చేపట్టనున్నారు. అందుకోసం గజ్వేల్ జిల్లా నుంచి 3 గ్రామాలు, మరో 24 జిల్లాల నుంచి 24 గ్రామాలను ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేడు సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి అక్షాంశ రేఖాంశాలను గుర్తించడం ద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలన్నది సర్కారు ఉద్దేశమని వివరించారు. పైలట్ సర్వేలో భాగంగా మొదట భూ వివాదాలు లేని గ్రామాల్లో డిజిటల్ సర్వే చేయాలని సూచించారు. ఆ తర్వాత అటవీభూములు, ప్రభుత్వ భూములు కలిసి ఉండే సమస్యలున్న, సమస్యలు లేని గ్రామాల్లో మిశ్రమంగా సర్వే చేపట్టాలని, తద్వారా క్షేత్రస్థాయిలో అనుభవం గడించాలని సీఎం కేసీఆర్ సర్వే ఏజెన్సీలకు వివరించారు.
ఈ పైలట్ సర్వే ద్వారా పూర్తిస్థాయి డిజిటల్ సర్వే నిమిత్తం విధివిధానాలు ఖరారు చేసుకోవాలని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా గ్రామాల్లో భూ వివాదాలు సమసిపోయాయని భావిస్తున్నాని, ఈ నేపథ్యంలో డిజిటల్ సర్వే 100 శాతం విజయవంతం అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఇక, వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే పూర్తయిన తర్వాత, పట్టణ భూముల డిజిటల్ సర్వే చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…