Hyderabad

ప్రగతి భవన్ లో సర్వే ఏజెన్సీలతో సమావేశం…

ప్రగతి భవన్ లో సర్వే ఏజెన్సీలతో సమావేశం…

  • -డిజిటల్ సర్వే తీరుతెన్నులపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
  • -జూన్ 11 నుంచి పైలట్ ప్రాజెక్టు
  • -తొలుత భూవివాదాల్లేని గ్రామాల్లో సర్వే
హైదరాబాద్:

తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.  ఈ డిజిటల్ సర్వేలో భాగంగా తొలుత జూన్ 11 నుంచి పైలట్ సర్వే చేపట్టనున్నారు. అందుకోసం గజ్వేల్ జిల్లా నుంచి 3 గ్రామాలు, మరో 24 జిల్లాల నుంచి 24 గ్రామాలను ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేడు సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి అక్షాంశ రేఖాంశాలను గుర్తించడం ద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలన్నది సర్కారు ఉద్దేశమని వివరించారు. పైలట్ సర్వేలో భాగంగా మొదట భూ వివాదాలు లేని గ్రామాల్లో డిజిటల్ సర్వే చేయాలని సూచించారు. ఆ తర్వాత అటవీభూములు, ప్రభుత్వ భూములు కలిసి ఉండే సమస్యలున్న, సమస్యలు లేని గ్రామాల్లో మిశ్రమంగా సర్వే చేపట్టాలని, తద్వారా క్షేత్రస్థాయిలో అనుభవం గడించాలని సీఎం కేసీఆర్ సర్వే ఏజెన్సీలకు వివరించారు.

ఈ పైలట్ సర్వే ద్వారా పూర్తిస్థాయి డిజిటల్ సర్వే నిమిత్తం విధివిధానాలు ఖరారు చేసుకోవాలని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా గ్రామాల్లో భూ వివాదాలు సమసిపోయాయని భావిస్తున్నాని, ఈ నేపథ్యంలో డిజిటల్ సర్వే 100 శాతం విజయవంతం అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఇక, వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే పూర్తయిన తర్వాత, పట్టణ భూముల డిజిటల్ సర్వే చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Venu

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

18 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

18 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

18 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago