మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
హోప్ అఫ్ హంగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఆశయంతో ప్రొజెక్ట్ నారీ తేజం పేరుతో మొదటి దశలో భాగంగా 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఇరవై మంది నిరుపేద మహిళలకు మూడు నెలల పాటు కుట్టు మిషన్ (స్ట్రిచింగ్) నైపుణ్య శిక్షణ కోర్సును నేర్పించారు. కోర్సు పూర్తిచేసుకున్న మహిళలకు డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతులమీదుగా టైలరింగ్ శిక్షణ ధ్రువీకరణ పత్రాలను అందించారు . అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ శిక్షణ కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్న మహిళలందరు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియచేసారు. డివిజన్ లోని పేద ప్రజలకు సేవ చేస్తున్న హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఆలేఖ్యకు కృతజ్ఞతలు తెలియచేసారు. మా డివిజన్ లో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని అటువంటి వారికి అండగా నిలుస్తూ ప్రాజెక్ట్ నారీ తేజం లో భాగంగా నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి వారికి స్వయం ఉపాధి కల్పిస్తున్న హోప్ ఆఫ్ హాంగర్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అలేఖ్య, వెంకటేశ్వరరావు, రవి కిరణ్, మీరయ్య, ఇందిరరాణి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…