పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు డివిజన్ పరిధిలోని నర్ర బస్తిలో గల హనుమాన్ దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం స్థానికులతో కలిసి హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం కాలనీవాసులతో సమావేశమయ్యారు. పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. హనుమాన్ దేవాలయం ఆధీనంలో గల భూమిలో భవనాన్ని నిర్మించి, ఆదాయం సమకూర్చేలా కృషి చేస్తామని తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన ధూప దీప నైవేద్యాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. మున్నూరు కాపు సంఘం స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సంగం సీనియర్ నాయకులు నాయికోటి రాజు, కాసాల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…