Telangana

క్రీడలకు కేంద్రంగా మైత్రి మైదానం_ఎమ్మెల్యే జిఎంఆర్

_ఘనంగా ముగిసిన జిఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్

_లక్ష 75 వేల రూపాయల నగదు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి స్టేడియంలో సంవత్సరం పొడవున వివిధ అంశాల్లో క్రీడలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.కేబీఎన్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని మైత్రి స్టేడియంలో ఏర్పాటు చేసిన జిఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై, విజేతలకు సొంత నిధులతో లక్ష 75 వేల రూపాయల విలువైన నగదు బహుమతులు, ట్రోఫీ లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. స్వతహా క్రీడాకారుడైన తాను క్రీడల అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తానని తెలిపారు. మైత్రి స్టేడియాని ఏడు కోట్ల రూపాయలతో పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు మెరాజ్ ఖాన్, కృష్ణమా చారి, క్రీడాకారులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

మరోసారి భక్తి భావం చాటిన ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత_ ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్ శాస్త్రోక్తంగా మొదలైన శ్రీ ఎల్లమ్మ పోచమ్మ…

7 hours ago

లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్ అధినేత సాయిరాం గుప్తా ఆధ్వర్యంలో చలివేంద్రం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్ చెరు పట్టణం ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా సాయి లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్…

7 hours ago

భవిష్యత్తుకు తగ్గ అధ్యాపకులను తీర్చిదిద్దుతాం

గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

*రియల్ హీరో సోనుసూద్ చేతుల మీదుగా ఘనంగా అశ్య ఫుడ్స్ ప్రోడక్ట్ లాంచ్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్:  ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…

3 days ago

కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు హైకోర్టు చెక్

“కాళేశ్వరం నిజం బయటపడింది  బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…

3 days ago

మహిళల భద్రత సామాజిక బాధ్యత

పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మహిళలు భయం లేకుండా…

3 days ago