_చిట్కుల్, లకడారం చెరువుల్లో చేప పిల్లల పంపిణీ
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని, ఇందుకు అనుగుణంగా 18 సంవత్సరాలు నిండిన ముదిరాజులు, గంగపుత్రులు మత్స్యకార సొసైటీల్లో సభ్యత్వం తీసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండల పరిధిలోని చిట్కుల్, లక్డారం గ్రామాల పరిధిలోని చెరువుల్లో ఆదివారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 5 లక్షల 21 వేల చేప పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకార రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నీలి విప్లవం సృష్టించారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతో పాటు, విస్తృత స్థాయిలో మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని తెలిపారు. మత్స్యకారులు ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సర్పంచులు సువర్ణ మాణిక్ రెడ్డి, నీలం మధు, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకార సహకార సంఘం ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…