– వ్యర్థాల నిర్వహణపై రేవతి మాచర్ల సూచన
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
మన ఇళ్ళలో వచ్చే వ్యర్థాలలో తొంభై శాతం పునర్వినియోగించవచ్చని , తద్వారా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చని బయో – ఎంజెమ్స్ నిపుణురాలు , ప్రకృతి ప్రేమికురాలు రేవతి మాచర్ల సూచించారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని వంట చేసే సిబ్బంది , పారిశుధ్య పనివారితో మంగళవారం ఆమె ముఖాముఖి నిర్వహించారు . మనం ప్రతి నిత్యం వంట గదిలో ఎన్నో కాయగూరల తొక్క వలుస్తామని , వాటిని వృథాగా పడేయకుండా 600 గ్రాముల తొక్కలకు 200 గ్రాముల బెల్లం , రెండు లీటర్ల నీటిలో కలిపి ఒక ప్లాస్టిక్ బాటిల్లో భద్రపరచుకోవాలని , అందులో కొంత బయో ఎంజె చేర్చితే 30 రోజుల్లోనే మనకు ఉపకరించే పదార్థం తయారవుతుందని చెప్పారు . అది మొక్కలకు వేస్తే చాలా మంచి జరుగుతుందన్నారు . అలాగే 300 గ్రాముల లెమన్ గ్రాస్ , వంద గ్రాముల బెల్లం , లీటరు నీటిలో కొద్దిగా ఎంజెమ్ చేర్చితే ఇళ్లు శుభ్రపరచుకునే పదార్థం తయారవుతుందన్నారు . వేపాకులో బెల్లం , నీరు , కొంత ఎంజెమ్ వేస్తే నీమ్ ఎంజెమ్ వస్తుందని చెప్పారు .
అలాగే గులాబీ పూలు , తులసి ఆకులతో కూడా ఎంజెలు తయారుచేసి ఫేస్ ప్యాక్లుగా వినియోగించుకోవచ్చన్నారు . అయితే వీటికి ఎండ తగల కూడదని , అందులో ఉత్పత్తి అయ్యే వాయువు బయటకు పోయేలా మధ్యమధ్యలో మూత తీసి మళ్లీ బిగించాలని సూచించారు . మిగిలిపోయిన అన్నం , బియ్యపు / శనగ పిండిలో రోజ్ ఎంజెమ్ కలుపుకుని ముఖానికి రాసుకుంటే బాగా నునుపుదేలి మెరుస్తుందన్నారు . ఇవన్నీ చేయడం ద్వారా దాదాపు 90 శాతం చెత్తను సద్వినియోగం చేయడంతో పాటు చెత్త గుట్టలు పేరుకుని , మిథేన్ గ్యాస్ ఉత్పత్తి కాకుండా కాపాడగలనుని చెప్పారు . ప్రతియేటా జనవరి 4 ని బయో ఎంజెమ్స్ దినోత్సవంగా నిర్వహిస్తారని , ఆరోజు తాను కాయగూరలతో రూపొందించిన 40 లీటర్ల ఎంజెమైను గీతం ప్రాంగణం పక్కనున్న చెరువులో కలుపుతానని , అది నీటి పీహెచ్ స్థాయి పెరగడానికి తోడ్పడడంతో పాటు చేపల వృద్ధికి కూడా ఉపకరిస్తుందన్నారు . తొలిసారి కరోనా విజృంభించినప్పుడు తాను ఓ అభిరుచిగా చేపట్టిన బయో ఎంజెమ్స్ కార్యక్రమం నేడు . ఎంతోమందికి ఉపకరిస్తుందని ఆమె చెప్పారు . థాయిలాండ్లోని బయో ఎంజెమ్స్ శిక్షకురాలి సహకారంతో రూపొందించిన పలు బయో ఎంజెమ్స్ ను ఆమె చూపించారు . పలువురి సందేహాలను నివృత్తి చేశారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…