Telangana

చెత్తను నివారించి పర్యావరణాన్ని కాపాడుదాం…

– వ్యర్థాల నిర్వహణపై రేవతి మాచర్ల సూచన

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

మన ఇళ్ళలో వచ్చే వ్యర్థాలలో తొంభై శాతం పునర్వినియోగించవచ్చని , తద్వారా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చని బయో – ఎంజెమ్స్ నిపుణురాలు , ప్రకృతి ప్రేమికురాలు రేవతి మాచర్ల సూచించారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని వంట చేసే సిబ్బంది , పారిశుధ్య పనివారితో మంగళవారం ఆమె ముఖాముఖి నిర్వహించారు . మనం ప్రతి నిత్యం వంట గదిలో ఎన్నో కాయగూరల తొక్క వలుస్తామని , వాటిని వృథాగా పడేయకుండా 600 గ్రాముల తొక్కలకు 200 గ్రాముల బెల్లం , రెండు లీటర్ల నీటిలో కలిపి ఒక ప్లాస్టిక్ బాటిల్లో భద్రపరచుకోవాలని , అందులో కొంత బయో ఎంజె చేర్చితే 30 రోజుల్లోనే మనకు ఉపకరించే పదార్థం తయారవుతుందని చెప్పారు . అది మొక్కలకు వేస్తే చాలా మంచి జరుగుతుందన్నారు . అలాగే 300 గ్రాముల లెమన్ గ్రాస్ , వంద గ్రాముల బెల్లం , లీటరు నీటిలో కొద్దిగా ఎంజెమ్ చేర్చితే ఇళ్లు శుభ్రపరచుకునే పదార్థం తయారవుతుందన్నారు . వేపాకులో బెల్లం , నీరు , కొంత ఎంజెమ్ వేస్తే నీమ్ ఎంజెమ్ వస్తుందని చెప్పారు .

అలాగే గులాబీ పూలు , తులసి ఆకులతో కూడా ఎంజెలు తయారుచేసి ఫేస్ ప్యాక్లుగా వినియోగించుకోవచ్చన్నారు . అయితే వీటికి ఎండ తగల కూడదని , అందులో ఉత్పత్తి అయ్యే వాయువు బయటకు పోయేలా మధ్యమధ్యలో మూత తీసి మళ్లీ బిగించాలని సూచించారు . మిగిలిపోయిన అన్నం , బియ్యపు / శనగ పిండిలో రోజ్ ఎంజెమ్ కలుపుకుని ముఖానికి రాసుకుంటే బాగా నునుపుదేలి మెరుస్తుందన్నారు . ఇవన్నీ చేయడం ద్వారా దాదాపు 90 శాతం చెత్తను సద్వినియోగం చేయడంతో పాటు చెత్త గుట్టలు పేరుకుని , మిథేన్ గ్యాస్ ఉత్పత్తి కాకుండా కాపాడగలనుని చెప్పారు . ప్రతియేటా జనవరి 4 ని బయో ఎంజెమ్స్ దినోత్సవంగా నిర్వహిస్తారని , ఆరోజు తాను కాయగూరలతో రూపొందించిన 40 లీటర్ల ఎంజెమైను గీతం ప్రాంగణం పక్కనున్న చెరువులో కలుపుతానని , అది నీటి పీహెచ్ స్థాయి పెరగడానికి తోడ్పడడంతో పాటు చేపల వృద్ధికి కూడా ఉపకరిస్తుందన్నారు . తొలిసారి కరోనా విజృంభించినప్పుడు తాను ఓ అభిరుచిగా చేపట్టిన బయో ఎంజెమ్స్ కార్యక్రమం నేడు . ఎంతోమందికి ఉపకరిస్తుందని ఆమె చెప్పారు . థాయిలాండ్లోని బయో ఎంజెమ్స్ శిక్షకురాలి సహకారంతో రూపొందించిన పలు బయో ఎంజెమ్స్ ను ఆమె చూపించారు . పలువురి సందేహాలను నివృత్తి చేశారు .

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago