Telangana

ఔషధ పునర్వినియోగం సమయం , ఖర్చులను తగ్గిస్తుంది…

– గీతం ఆతిథ్య ఉపన్యాసంలో ఆఫ్రికా ప్రొఫెసర్ యశోద కృష్ణ

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

ఔషధ పునర్వినియోగం అనేది ఆమోదం పొందిన లేదా పరిశోధనాత్మక ఔషధాల కోసం కొత్త ఉపయోగాలను గుర్తించే ప్రక్రియ అని , నూతన ఔషధాలను కనుగొనే ప్రక్రియతో పోలిస్తే ఇది తక్కువ సమయం , ఖర్చుతో కూడుకున్నదని నెర్జోబీ ( కెన్యా ) లోని యునెటైడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ యశోద కృష్ణ జనపతి పేర్కొన్నారు . గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో ‘ ఔషధ పునర్వినియోగం : ఒక వ్యూహాత్మక విధానం ‘ అనే అంశంపై సోమవారం ఆతిథ్య ఉపన్యాసం చేశారు . కొత్త ఔషధాల ఆవిష్కరణ , ఇప్పటికే ఉన్న ఔషధాల వినియోగానికి సంబంధించిన కీలక అంశాలపై ఆయన లోతైన అవగాహనను ఏర్పరచారు . కరోనా వంటి కొత్త అంటువ్యాధుల వ్యాప్తి నిరోధానికి కొత్త ఔషధాల ఆవిష్కరణకు , చాలా తక్కువ సమయంలో తగిన చికిత్సా విధానాలు , ఔషధ చికిత్సలను ఎంచుకోవడానికి ఆరోగ్య నిపుణుల ముందు ప్రత్యేకమైన సవాళ్లున్నాయని డాక్టర్ యశోద కృష్ణ పేర్కొన్నారు . ఇటువంటి స్థితిలో ఔషధ పునర్వినియోగం వల్ల గణనీయమైన పరిశోధనా సమయంతో పాటు వ్యయాన్ని కూడా తగ్గించుకోవచ్చన్నారు . ఔషధ పునర్మిర్మాణ ప్రయత్నాలు నిర్దిష్ట వ్యాధి లక్ష్యంతో పాటు ఔషధం బహుళ ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆయన వివరించారు . తొలుత , ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్ . కుమార్ అతిథిని పరిచయం చేసి , సత్కరించారు . ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొని , తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

6 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

6 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago