పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
నిర్మాణాల పునరుద్ధరణ , మరమ్మతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినట్టు గీతం పూర్వ విద్యార్థి , హిల్టీ ఇండియా స్పెసిఫికేషన్ కన్సల్టెంట్ త్రివేద్ నౌదురి చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ నిర్మాణాల పునరుద్ధరణకు రూపకల్పన పరిష్కారాలు ‘ అనే అంశంపై బుధవారం నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు . గీతం ఆవిష్కరణల మండలి ( ఐఐసీ ) సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యశాలలో ఆయన మాట్లాడుతూ , నిర్మాణాల మరమ్మత్తు , పునరావాసంలో ముందుగానే ఏర్పాటుచేసిన యాంకరింగ్ క్రియాశీల భూమిక పోషిస్తుందని చెప్పారు . ఎందుకంటే , అప్పటికే ఉన్న నిర్మాణాలను అనుసంధానించడానికి , కొత్త విభాగాల ఏర్పాటుకు యాంకరింగ్ తోడ్పడుతుందన్నారు .
స్ట్రక్చరల్ రీబార్ యాంకరింగ్ అంటే- అప్పటికే ఉన్న కాంక్రీటు నిర్మాణంలో రంధ్రాలు చేయడం , వాటిలోకి ఇనుప రాడ్లను చొప్పించడం , రసాయనాలను పంపించడమని త్రివేద్ వివరించారు . ఈ విధానంలో ప్రధాన నిర్మాణాన్ని మార్చకుండా , ప్రస్తుత అవసరాల మేరకు ఆయా సౌకర్యాలను పునరుద్ధరించవచ్చన్నారు . యాంకర్ ఆధార పలకను కాంక్రీటుకు అనుసంధానం చేయడానికి అవసరమైన యాంకర్ల సంఖ్య , చుట్టుకొలత , చొప్పించాల్సిన లోతులను లెక్కించగల అంతర్జాతీయ హిల్టీ ప్రొఫెస్ట్ సాఫ్ట్వేర్ను ఆయన గీతం విద్యార్థులకు పరిచయం చేశారు . త్రివేద్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యశాలలో హిల్టీ ఇండియా సాంకేతిక విభాగాధిపతి ముఖేష్ ఆలూరు , కన్సల్టెంట్ సల్మాన్ కూడా పాల్గొన్నారు . విద్యార్థులు లేవనెత్తిన పలు సందేహాలను వారు నివృత్తిచేశారు . తొలుత , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య అతిథిని సత్కరించారు . గీతం పూర్వ విద్యార్థుల సమన్వయకర్త డాక్టర్ పి.త్రినాథరావు స్వాగతోపన్యాసం చేయగా , కార్యశాల నిర్వాహకురాలు డాక్టర్ జి.జ్యోతికుమారి వందన సమర్పణ చేశారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…