మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
సిసి కెమెరాలు ఏర్పాటుతో శాంతి భద్రతలు లభిస్తాయని లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో మహీధర లగ్జూరియా విల్లాస్ యాజమాన్యం మహీధర లగ్జూరియా విల్లాస్ 3 జోన్స్ కి 50 సీసీ కెమెరాలు స్వర్ణాక్షి డెవలపర్స్ అధినేత జి విజయ సాగర్, జి. సాయి కిరణ్, స్థానికులు కిషోర్ రెడ్డిల సహకారంతో ఏర్పాటు చేయగా వాటిని డిసిపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు అవుతున్న అన్ని వెంచర్లలను విలువగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల తగ్గుదలకు అవకాశం తో పాటు నేరాలు జరిగిన సందర్భాలలో నిందితులను వేగంగా గుర్తించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ కోట్లు పెట్టి ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటుకు శ్రద్ధ చూపకపోవడం దురదృష్టకరమని ఇంటికి తాళం కంటే సిసి కెమెరా విలువ ఎక్కువ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ వినాయక రెడ్డి, ఎస్సై ఆసిఫ్ ఆలీ
స్థానిక నాయకులు స్వాతి రెడ్డి, రమ్య, నవీన్ బొల్ల, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
…….
