బిఆర్ఎస్ లో చేరిన భానూరు కాంగ్రెస్ కీలక నాయకులు, వార్డు సభ్యురాలు..

politics Telangana

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రివర్యులు,

బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీరు హరీష్ రావు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నాయకత్వంలో మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ విధానాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ లో చేరుతున్నారని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ప్రవళిక నరేందర్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాగర్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కుమ్మరి శివయ్య లు తమ అనుచరులతో కలిసి శనివారం సాయంత్రం హైదరాబాద్ లో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీకి అడ్డా అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికిని అదే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటే ఆ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలను బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని గుర్తు చేశారు.
ప్రజలందరూ తిరిగి కెసిఆర్ పరిపాలన రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని ఆయన తెలిపారు. వీరి రాకతో బానూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మరింత బలపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, శ్రీధర్ చారి, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *