రోగులకు ధైర్యం చెప్పిన కేసీఆర్..
– ఆక్సిజన్, ఔషధాల లభ్యత గురించి ఆరా
– ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులకు దిశా నిర్దేశం
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిని సందర్శిస్తున్నారు. ఆయనతో పాటు మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పలువురు అధికారులు కూడా వున్నారు. ఆక్సిజన్, ఔషధాల లభ్యత గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
గాంధీ ఆసుపత్రిలో కరోనా అత్యవసర వార్డును కూడా సీఎం సందర్శించారు. చికిత్స పొందుతోన్న కరోనా రోగులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఓపీ విభాగంలోనూ కరోనా చికిత్స సదుపాయాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. జూనియర్ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని కేసీఆర్ అభినందించారు. కాగా, కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…