Categories: politics

రామేశ్వరంబండ అభివృద్ధికి సంపూర్ణ సహకారం…

రామేశ్వరంబండ అభివృద్ధికి సంపూర్ణ సహకారం…
– అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

పటాన్ చెరు:

నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని రామేశ్వరంబండ గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఐక్యంగా గ్రామ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామంలో ఇప్పటికే ప్రతి కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని, త్వరలో బచ్చు గూడెం చౌరస్తా నుండి గ్రామం వరకు రెండు లైన్ల బిటి రోడ్డు పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామ కూడళ్ళలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టినప్పుడే ప్రజల నమ్మకాన్ని సార్థకం చేసిన వాళ్లమవుతామని తెలిపారు. రామేశ్వరం బండ గ్రామ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ అంతి రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Venu

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago