Districts

కొత్త ఆవిష్కరణల వైపు విద్యార్థులను ప్రోత్సాహిస్తున్న జ్యోతి విద్యాలయ హై స్కూల్

మనవార్తలు ,శేరిలింగంపల్లి :

నేటి విద్యార్థులే రేపటి భావిభారత పౌరులు అనే నానుడిని నిజం చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తుంది బి హెచ్ ఈ ఎల్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ . ఎక్కడ ఎలాంటి పోటీలు జరిగినా అక్కడ జ్యోతి విద్యాలయ హై స్కూల్ విద్యార్థులు తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తూ తమ ప్రతిభను కనబరుస్తున్నారు. విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలను గుర్తిస్తూ ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు అధ్యాపక బృందం. ప్రతిసంవత్సరం నిర్వహించే జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్, ఇన్స్ ఫైర్ ఎగ్జిబిషన్ కం ప్రాజెక్ట్ కాంపిటేషన్ లో. విద్యార్థులు పాల్గొని బహుమతులు గెలుస్తున్నారు.

అలాగే ఈ సంవత్సరం కూడా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ న్యూ ఢిల్లీ మరియు ఎస్.సి.ఈ.ఆర్.టి హైదరాబాద్ వారు ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన ఇన్ స్పైర్ ఎగ్జిబిషన్ కం ప్రాజెక్ట్ కాంపిటీషన్ లో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 132 ప్రదర్శనలు పాల్గొనగా అందులో 14 ఎంపికవ్వగా అందులో రామచంద్రాపురం మండలం నుండి రెండు ఎంపికవ్వగా అందులో జ్యోతి విద్యాలయ హై స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న అమిరిశెట్టి నిహారిక రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవ్వడం పట్ల స్కూల్ ఫాదర్ అండ్రూస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి లు విద్యార్థిని ని అభినందించారు. ఈ ఎగ్జిబిషన్ లో విద్యార్థిని నిహారిక రైతులకు ఉపయోగ పడే రిమోట్ అపరేటెడ్ అగ్రికల్చర్ సీడింగ్ మిషన్ ను తయారు చేసి తన ఆలోచనకు, ఆవిష్కరణలకు పదును పెట్టింది.

రైతులకు ఎంతో మేలు …..

రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేసే నాట్లు వేసే మిషన్ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, లేబర్ ఖర్చుతో పాటు సమయాభావం కూడా కలిసొస్తుందని హెడ్ ఆఫ్ ద సైన్స్ డిపార్ట్మెంట్ హిమబిందు తెలిపారు. తక్కువ ఖర్చుతో, తక్కువ మంది కూలీలతో ఎక్కువ లాభాలు పొందేందుకు ఇలాంటి పరికరాలు, యంత్రాలు ఎంతో అవసరం అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు కష్ట పడకుండా కూర్చున్న చోటు నుండే అన్నివిధాలా వ్యవసాయానికి ఉపయోగకరమైన పరికరాలు, యంత్రాలు తయారు చేసేందుకు విద్యార్థులను ప్రోత్సహిస్తామని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ఆమె కోరారు.

అన్నివిధాలుగా విద్యార్థులను ప్రోత్సహిస్తాం – ఉమామహేశ్వరి

వ్యవసాయ దారులకు మేలు చేసే ఇలాంటి యంత్రాలు, పరికరాలను రూపొందించడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తామని స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన వస్తువులను మా సిబ్బంది సమకూర్చి వారి విజయంలో సిబ్బంది పాత్ర ఉండేలా చూస్తామన్నారు. విద్యార్థులు ఇలాంటి చక్కటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మరిన్నీ పోటీ పరీక్షల్లో, ఎగ్జిబిషన్ లలో తమ ప్రతిభను చాటుకుంటు స్కూల్ కు, అధ్యాపక బృందానికి మంచి గుర్తింపు తీసుకువస్తు వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

Ramesh

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago