మన వార్తలు,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అడ్మిషన్ల కార్యాలయాన్ని మంగళవారం మాదాపూర్ లోని వంద అడుగుల రోడ్డులో అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ ప్రారంభించారు . ఏటికేడాది పలు వినూత్న కోర్సులను ప్రారంభిస్తున్న గీతమ్ ఆయా సమాచారం జంట నగర వాసులకు సులువుగా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని మాదాపూర్ ప్రారంభించినట్టు ప్రోవీసీ చెప్పారు . గీతం ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మరింత చేరువగా , పారదర్శకంగా , కేంద్రీకృతంగా , సులువుగా అందుబాటులో ఉండేలా ఈ ఏర్పాటు చేశామన్నారు . విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా అత్యుత్తమ విద్యను బోధిస్తూ గీతం దినదినాభివృద్ధి చెందుతోందని ప్రొఫెసర్ శివప్రసాద్ వ్యాఖ్యానించారు .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గీతం సొసెటీ కార్యదర్శి ఎం . భరద్వాజ్ మాట్లాడుతూ , విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఉపకరించే ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలు , నిబద్ధతతో కూడిన – తగిన విద్యార్హత గల అధ్యాపకులు , అత్యుత్తమ బోధన- శిక్షణలను గీతం అందిస్తోందని చెప్పారు . గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , సోషల్ సెన్సైస్ డెరైక్టర్ ప్రొఫెసర్ వీవీవీ నాగేంద్రరావు , కెరీర్ గెడైన్స్ కేంద్రం డెరైక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ , హైదరాబాద్ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ ఉదయకుమార్ , హెస్ఆర్ మేనేజర్ శిరీషా జెట్టి తదితరుల సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…