Hyderabad

అంతరిక్ష పరిశోధనల్లో భారత్ శాసించే స్థాయికి చేరుకుంటుంది – రిటైడ్ సైoటిస్ట్ శివప్రసాద్

 మన వార్తలు,శేరిలింగంపల్లి :

రానున్న కొన్ని సంవత్సరాల్లో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ మిగతా దేశాలను శాసించే స్థాయికి చేరుకుంటుందని ఇస్రో విశ్రాంత శాస్త్ర వేత్త యెల్లా శివప్రసాద్ అన్నారు. బి.హెచ్.ఈ. ఎల్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి పిలుపు మేరకు ఆయన స్కూల్ ను సందర్షించి విద్యార్థులకు, ఉపాద్యాయులకు అంతరిక్ష పరిశోధన ల గురించి వివరించారు. అంతరిక్షంలో జరిగే పరిశోధనలు, రాకెట్ల తయారీ, వాటి ప్రయోగం, ఉపయోగం గురించి వివరించే విదంగా పుస్తకాల్లో పాఠ్యoశoగా చేర్చాలని ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. పిల్లల్లో చిన్నప్పటి నుండి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిజ్ఞానం ఉండాలని తెలిపారు. రాకెట్ల తయారీ, ఉపగ్రహల ప్రయోగం గురించి వివరిస్తే వారు భవిశ్యథ్ లో దేశం గర్వించే గొప్ప శాస్త్ర వేత్తలుగా తయారవుతారని పేర్కొన్నారు. త్వరలోనే ప్రపంచంలో అబ్బురపరిచే విధంగా మన పరిశోధనలు ఉంటబోతున్నట్లు తెలిపారు.

సొంతంగా సొంతింటి కల….
త్వరలోనే అంతరిక్షంలో సొంతంగా సొంతింటి కల నెరవేరనుందని, అందుకు భారతీయ శాస్త్ర వేత్తలు తీవ్ర కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ప్రయోగించిన అనేక ఉపగ్రహల్లోనూ, రాకెట్ల లలోను తన సేవాలున్నాయని, ఇపుడు పిల్లల్లో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని నింపేందుకు ఉచితంగా తన అనుభవాలను పంచుకొంటూ వారిలో ఆసక్తిని నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన జ్యోతి విద్యాలయ హై స్కూల్ ఫాదర్ అండ్రూస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago