Telangana

బిజెపి నుండి బిఆరెస్ లోకి చేరికలు

– గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రవి యాదవ్

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, బిజెపి చేస్తున్న మత విద్వేషాలు రెచ్చ గొట్టే విధానాలు నచ్చక చాలా మంది సీనియర్ నాయకులు, యువకులు బిఆరెస్ పార్టీ లో చేరుతున్నారని గ్రేటర్ హైదరాబాద్ బిఆరెస్ యూత్ వైస్ ప్రెసిడెంట్, శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు మారబోయిన రవి యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బిఆరెస్ పార్టీ కి పూర్వవైభవం తీసుకువస్తామని ధీమా వ్యక్తo చేశారు. ఆదివారం రోజు శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్ కు చెందిన బిజెపి నాయకులు వాకిటి శంకర్, టి. చంద్ర ల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో సీనియర్ నాయకులు, యువకులు బిజెపి పార్టీ నీ వీడి బిఆరెస్ లో చేరగా వారికీ రవి యాదవ్ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు అనాలోచిత నిర్ణయం తొ ప్రజలు తొందర పడి కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేశామని పశ్చాతాప పడుతున్నారని, మళ్ళీ బిఆరెస్ పార్టీ చేసిన అభివృద్ధి నీ చూసి పార్టీ లోకి వస్తున్నారని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బిఆరెస్ పార్టీ కి పూర్వవైభవం తీసుకువస్తామని ధీమా వ్యక్తo చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కే. ఎన్. రాములు, ప్రభాకర్ గౌడ్, డాక్టర్ రవికుమార్, స్వామి, శ్రీను, వెంకట్ చారి, సురేష్, కొండాకల్ శ్రీను, చింతల శ్రీకాంత్ యాదవ్, పంతం సురేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, సాయినందన్ ముదిరాజ్,మల్లేష్ గౌడ్, గడ్డ మహేష్, పవన్, సత్యనారాయణ గౌడ్, బబ్లు, విశాల్, పూర్ణ, మనోజ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

5 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago