Telangana

స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ లో విజయ దుందుభి మోగించిన శ్రీ చైతన్య నల్లగండ్ల విద్యార్థులు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

శ్రీ చైతన్య నల్లగండ్ల విద్యార్థులు మరోసారి తమ సత్తాను నిరూపించారు. చదువులోనే కాదు అన్ని రంగాల్లోనూ ముందుంటామని మరోసారి చాటి చెప్పారనీ స్కూల్ ప్రిన్సిపాల్ యూ. వాణి తెలిపారు. శ్రీ చైతన్య పాఠశాలల యాజమాన్యం స్వర్గీయ బి. యస్. రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ నిర్వహించింది. ఈ కాంపిటీషన్ లో నల్లగండ్ల విద్యార్థులు బ్యాట్మెంటన్ లో ప్రథమ స్థానాన్ని షార్ట్ పుట్ లో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుని ఘన విజయం సాధించారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రికెట్ స్పోర్ట్స్ పర్సన్ గొంగడి త్రిష, శ్రీ చైతన్య పాఠశాలల డైరెక్టర్ సీమ, ఏజీఎం. శివరామకృష్ణ, ఆర్ ఐ. అనిత, జోనల్ స్పోర్ట్స్ రిసోర్స్ పర్సన్ రాజశేఖర్, జోనల్ స్పోర్ట్స్ ఇంచార్జ్ మధు, స్పోర్ట్స్ టీచర్స్ సుబుద్ధి, సంతోష్ లు పాల్గొన్నారు. మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన విద్యార్థులు పలువురి చూపరుల ప్రశంసలు అందుకున్నారు. విజేతలను ఏజీఎం శివరామకృష్ణ, ఆర్. ఐ. అనిత చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్స్, ఛాంపియన్ ట్రోఫీని అందుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ యు వాణి తమ విద్యార్థులు ఇంతటి ఘనవిజయం సాధించినందుకు గర్వంగా ఉందని ఈ విజయానికి కారణమైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలని ఆకాంక్షించారు. శ్రీ చైతన్య యాజమాన్యం విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago