Telangana

స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ లో విజయ దుందుభి మోగించిన శ్రీ చైతన్య నల్లగండ్ల విద్యార్థులు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

శ్రీ చైతన్య నల్లగండ్ల విద్యార్థులు మరోసారి తమ సత్తాను నిరూపించారు. చదువులోనే కాదు అన్ని రంగాల్లోనూ ముందుంటామని మరోసారి చాటి చెప్పారనీ స్కూల్ ప్రిన్సిపాల్ యూ. వాణి తెలిపారు. శ్రీ చైతన్య పాఠశాలల యాజమాన్యం స్వర్గీయ బి. యస్. రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ నిర్వహించింది. ఈ కాంపిటీషన్ లో నల్లగండ్ల విద్యార్థులు బ్యాట్మెంటన్ లో ప్రథమ స్థానాన్ని షార్ట్ పుట్ లో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుని ఘన విజయం సాధించారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రికెట్ స్పోర్ట్స్ పర్సన్ గొంగడి త్రిష, శ్రీ చైతన్య పాఠశాలల డైరెక్టర్ సీమ, ఏజీఎం. శివరామకృష్ణ, ఆర్ ఐ. అనిత, జోనల్ స్పోర్ట్స్ రిసోర్స్ పర్సన్ రాజశేఖర్, జోనల్ స్పోర్ట్స్ ఇంచార్జ్ మధు, స్పోర్ట్స్ టీచర్స్ సుబుద్ధి, సంతోష్ లు పాల్గొన్నారు. మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన విద్యార్థులు పలువురి చూపరుల ప్రశంసలు అందుకున్నారు. విజేతలను ఏజీఎం శివరామకృష్ణ, ఆర్. ఐ. అనిత చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్స్, ఛాంపియన్ ట్రోఫీని అందుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ యు వాణి తమ విద్యార్థులు ఇంతటి ఘనవిజయం సాధించినందుకు గర్వంగా ఉందని ఈ విజయానికి కారణమైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలని ఆకాంక్షించారు. శ్రీ చైతన్య యాజమాన్యం విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago