_గీతం పరీక్షా కేంద్రంలో 2,635 మంది విద్యార్థుల హాజరు
మనవార్తలు ,పటాన్ చెరు:
జేఈఈ మెయిన్స్ రెండో దశ పరీక్ష శనివారంతో ముగియనుందని , దీనికి 2,635 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు సంగారెడ్డి సిటీ కో – ఆర్డినేటర్ ఇ.జ్యోతిరెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . ఈనెల 25 న ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ పరీక్షను రెండు పిస్టుల పద్ధతిలో ( ఉదయం 9 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు ఆమె తెలియజేశారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , రుద్రారం ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్టీఏ అబ్జర్వర్గా కె.అరవింద్ , ఫ్లయింగ్ స్క్వాడ్గా మణికంఠం , మోహన్లు వ్యవహరిస్తున్నట్టు జ్యోతిరెడ్డి పేర్కొన్నారు . విశ్రాంత సెనికుడిని ఉప పరిశీలకుడిగా , మరికొంత మందిని పరిశీలకులుగా నియమించి , పరీక్షలు సజావుగా నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…